అష్టదిగ్గజములు
వికీపీడియా నుండి
హిందూ పురాణలలో ఎనిమిది దిక్కులనూ కాపాలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటారయని ప్రతీతి. ఇవే అష్టదిగ్గజాలు. వీటికి మళ్లే శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు. వీరికి కడప జిల్లాలోని తిప్పలూరు గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది. అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- ధూర్జటి
- మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
- అయ్యలరాజు రామభధ్రుడు
- పింగళి సూరన
- రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
- తెనాలి రామకృష్ణుడు
అష్టదిగ్గజాలు
- ఐరావతం
- పుండరీకం
- వామనం
- కుముదం
- అంజనం
- పుష్పదంతం
- సార్వభౌమం
- సుప్రతీకం
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |