సభ్యులపై చర్చ:Manthena

వికీపీడియా నుండి

Manthena గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

[మార్చు] ఆశ్చర్యం

మంతెన గారూ! భారత ప్రభుత్వం వారి జనగణన సీడీల్లో చూసాను.. పిట్టలవానిపాలెం మండలం కింద ఉన్న గ్రామాల్లో మంతెనవారిపాలెం పేరు లేదు. అసలు మంతెనవారిపాలెం పేరే ఆ జాబితాలో లేదు. ఆశ్చర్యంగా ఉంది. మంతెనవారిపాలెం కు సిరిపూడి అనే పేరు కూడా ఉందా? సిరిపూడి నగరం మండలంలో ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 02:27, 31 ఆగష్టు 2006 (UTC)

జనగణనల్లో కేవలము పంచాయితీ గ్రామాల పేర్లు మాత్రమే ఉన్నాయనుకుంటా --వైఙాసత్య 03:06, 31 ఆగష్టు 2006 (UTC)
చదువరి గారు,మీరు చూసిన జనగణన సీడీల్లో ఎమయిన తప్పు వుండి వుండవచ్హు.ఫుర్వం రాచసిరిపూడిగా పిలవబడు ఈ చిన్న పల్లెటూరు బాపట్ల తాలుకాలొ యున్నది. 1983 లొ మండల వ్యవస్థ వచ్చిన తరువాత మంతెనవారిపలెం గ్రామం పిట్టలవానిపాలెం మండలం కింద చెర్చబడినది. మంతెనవారిపలెం గ్రామమునకు సరిహద్దు గ్రామం సిరిపూడి . ఈ రొండు గ్రామలు పక్క పక్కనె వుంటాయి.సిరిపూడి గ్రామం నగరం మందలం కింద వుంది. మీకు ఎమయిన ప్రశ్నలు వుంటె నాకు ఈ-మేఇల్ చెయ్యండి. (manthena_sridhar@yahoo.com)
to find more about mantenavariplem latest election list:
http://www.apsec.gov.in:8080/apsec/previouselectiondata/GTR_MPTC2001.pdf
http://www.gunturonline.net/~guntur/html/dcbind.php?name=5 -సభ్యుడు:శ్రీధర్ మంతెన 15:46, 2 సెప్టెంబర్ 2006 (UTC)
శ్రీధర్ గారూ, నేను ఇంటర్మీడియెట్ పిట్టలవానిపాలెంలోనే చదివాను. మంతెనవారిపాలెం ఊరు నాకు తెలుసు. అందుకే జనగణన జాబితాలో అది లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. __చదువరి (చర్చ, రచనలు) 16:29, 2 సెప్టెంబర్ 2006 (UTC)

చదువరి గారు, అవును నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది మీరు చూసిన జనగణన సీడీ లు నేను అన్‌లైన్లొ ఎక్కడ చూదవచ్హు?. కొంచం సహయం చెయగలరా? నేను వారికి వివరముగా మైల్ పంపిస్థాను. మీరు పిట్టలవానిపాలెం కాలెజి లొ చదివారా? చాల ఆశ్చర్యం! ఎ సంవత్సరంలొ చదివారు? మీ వ్యాసాలు, రచనలు, బ్లాగులు వికిపెడియ లొ చూసాను? చాల మంచిగా వున్నాయి. ఎంతొ మంచి పని చేస్తున్నారు. Manthena 03:50, 3 సెప్టెంబర్ 2006 (UTC)

థాంక్సండి. 1979-81లో అక్కడ ఇంటర్మీడియెట్ చదివాను. మాది కావూరు. మాఊర్లో కాలేజీ ఉందిగానీ, పిట్టోడిపాలెంలో మంచి లెక్చరర్లు ఉన్నారని అక్కడ చేరాను. మధుసూదనరావు గారు లెక్కలు, కొల్లి సాంబశివరావు గారు ఫిజిక్సు చెప్పేవారు. అక్కడ చదవడం నా తరువాతి వదువుకు బాగా ఉపయోగ పడింది. మాఊరు వెళ్ళి రావాలంటే మంతెనవారిపాలెం, రాంభొట్లవారిపాలెం మీదుగా సైకిలుపై వెళ్ళేవాణ్ణి, లేదా తెనాలి-అల్లూరు బస్సు! లేదంటే చందోలెళ్ళి తెనాలి-నిజాంపట్నం బస్సు పట్టుకునేవాణ్ణి. అక్కడి టూరింగు టాకీసులో రోజూ సాయంత్రం సినిమా మొదలెట్టే ముందు పాటలు వేసేవాళ్ళు. "నమో వెంకటేశా.." అనే ఘంటసాల పాటతో మొదలెట్టేవాళ్ళు. రోజూ పొద్దున పళ్ళు తోముకోవడం ఎలాగో, సాయంత్రం ఈ పాటలు వినడమూ అలాగే! గొప్ప రోజులవి!