ఖమ్మం ఖిల్లా
వికీపీడియా నుండి
కాకతీయ వంశస్తుల (౧౦ - ౧౩ వ శతాబ్దం) పరిపాలనలో ఖమ్మం ఖిల్లా నిర్మాణానికి పునాదులు సుమారుగా క్రీస్తు శకం ౯౫౦ న పడినాయి. తరువాత రెడ్డిరాజులు, వెలమరాజులు ఈ కోటను ఇంకా మెరుగుపరిచినారు. ఖమ్మం ఖిల్లా స్తంబాద్రి అనే కొండపై ఉన్నది. ఆ తరువాత వచ్చిన కుతుబ్ సాహీ వంశస్తులు (౧౫౩౧) కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించినారు.