దిగంబర కవులు

వికీపీడియా నుండి

అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు.

  1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు
  2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి
  3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి
  4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు
  5. జ్వాలా ముఖి - వీరరాఘవాచార్యులు
  6. భైరవయ్య - మన్మోహన్ సహాయ

వీరి కవితలు చాలా ఘాటుగా ఉంటాయి. ఎంత హాఠాత్తుగా మొదలయినదో అంతే హాఠాత్తుగా ఆగిపోయినది. తరువాత వీరు విడిపొయ్యి నలుగు విరసం ఇద్దరు అరసం లోనూ చేరినారు.

ఒక కవిత చూడండి

ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళూ 
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టుతా ఒక్కటే
అమ్మ ఎవరయితేనేం?
చనుబాలు తీపంతా ఒక్కటే
బిక్క ముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణీగా కేసుపుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను