జంషీద్ కులీ కుతుబ్ షా

వికీపీడియా నుండి

జంషీద్ కులీ కుతుబ్ షా (? - 1550), గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన రెండవ సుల్తాను. ఈయన 1543 నుండి 1550 వరకు పాలించాడు.

జంషీద్ తండ్రి, సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి ముస్లిం పాలకుడయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా తండ్రిని చంపి, సోదరున్ని కళ్లు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. జంషీద్ కొడుకైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరానికి పారిపోయి రామరాయలను ఆశ్రయించాడు.

జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని క్రూరత్వము చాలా ప్రసిద్ధి చెందినది. 1550 లో ఈయన మరణము తర్వాత, కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సిమ్హాసనాన్ని అధిష్టించాడు.


ఇంతకు ముందు ఉన్నవారు:
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్
గోల్కొండ సుల్తానులు
1543—1550
తరువాత వచ్చినవారు:
సుభాన్ కులీ కుతుబ్ షా


కుతుబ్ షాహీలు
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ | జంషీద్ కులీ కుతుబ్ షా | సుభాన్ కులీ కుతుబ్ షా | ఇబ్రహీం కులీ కుతుబ్ షా | మహమ్మద్ కులీ కుతుబ్ షా | సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా | అబ్దుల్లా కుతుబ్ షా | అబుల్ హసన్ కుతుబ్ షా