అనంతపురం
వికీపీడియా నుండి
అనంతపురం జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | రాయలసీమ |
ముఖ్య పట్టణము: | అనంతపురం |
విస్తీర్ణము: | 19,130 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 36.39 లక్షలు |
పురుషులు: | 18.59 లక్షలు |
స్త్రీలు: | 17.79 లక్షలు |
పట్టణ: | 9.2 లక్షలు |
గ్రామీణ: | 27.19 లక్షలు |
జనసాంద్రత: | 190 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | 14.31 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 56.69 % |
పురుషులు: | 68.94 % |
స్త్రీలు: | 43.87 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
అనంతపురం (Anantapur or Anantapuram) దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి యేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వ్యవసాయ ఆధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము
అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున కడప జిల్లా, ఆగ్నేయమున చిత్తూరు జిల్లా, మరియు పశ్చిమాన, నైఋతిన కర్నాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములో పెద్ద పెద్ద గ్రానైటు శిలలమయమైన ఎత్తైన మెలికెలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగము ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాగ్ని, స్వర్ణముఖి మరియు తడకలేరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతము కురుస్తుంది. రాజస్థాన్ లోని జైసల్మీరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
[మార్చు] జిల్లా విశిష్టతలు
- జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబర్ కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవనయువిద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. రామగిరి, సింగనమల, వజ్రకరూరు జిల్లాలోని కొన్ని ప్రముఖ పవనవిద్యుత్కేంద్రాలు.
- జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
- శ్రీ సత్యసాయి బాబా గారి అశ్రమము ప్రశాంతి నిలయము అనంతపురం జిల్లా లోని పుట్టపర్తిలో కలదు
[మార్చు] జిల్లా ప్రముఖులు
- పూర్వ భారత రాష్ట్రపతి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి(రెండుమార్లు), లోక్సభ స్పీకరు (రెండుమార్లు), ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, నీలం సంజీవరెడ్డి
- ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్సభ సభ్యుడు, తరిమెల నాగిరెడ్డి
- పూర్వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.
- ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కె. వి. రెడ్డి జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో జన్మించారు.
[మార్చు] గణాంకాలు
[మార్చు] మండలాలు
|
|
|
|
[మార్చు] పర్యాటక కేంద్రాలు
అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, పెనుకొండ మరియు రాయదుర్గం కోటలు, పుణ్య క్షేత్రమైన పుట్టపర్తి, మరియు లేపాక్షి దేవాలయమునకు ప్రసిద్ధి. గుత్తిలో సముద్రమట్టమునకు 2171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము కలదు. ఇటువంటిదే బెంగుళూరుకు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుకొండలో కలదు. హైదర్ అలీ ఆక్రమించుకొనేవరకు గుత్తి దుర్గము మరాఠులకు గట్టిపట్టుగా ఉన్నది. 1789లో టిప్పూసుల్తాన్ దీనిని నిజాం వశము చేశాడు. 1800లో నిజాం ఇతర రాయలసీమ(దత్త మండలము) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు.kadiri ki sameepamlo ni timmammma marrimaanu guinnes recordlona namodu ainadi.
అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి, ధర్మవరం, మరియు రాయదుర్గం. జిల్లాలోని ముఖ్య పట్టణములు. ఆలూరు, చిత్రచేడు, ఎనుమలదొడ్డి, గుత్తి, లేపాక్షి, మరియు పుట్టపర్తి ఇతర ప్రధాన ప్రదేశములు.
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | ![]() |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |