ఇస్మాయిల్ ఆదిల్షా
వికీపీడియా నుండి
ఇస్మాయిల్ ఆదిల్షా బీజాపూరు సుల్తాను. ఈయన 1510 నుండి 1534 వరకు బీజాపూరు ను పరిపాలించాడు. తన పరిపాలనా కాలము మొత్తము రాజ్యవిస్తరణలో గడిపిన ఇస్మాయిల్ ఆదిల్షా తన కాలములో దక్కన్ ప్రాంతములో ఆదిల్షాల అధికారమును పటిష్టము చేసినాడు.
[మార్చు] తొలి నాళ్లు
ఇస్మాయిల్ ఆదిల్షా బాల్యములోనే తండ్రి యూసుఫ్ ఆదిల్షా తరువాత బీజాపూరు రాజైనాడు. రాజ వ్యవహారములను మంత్రి కమాల్ ఖాన్ చేతులో ఉండేవి. కమాల్ ఖాన్ పాలిస్తున్న దశలో ఆయన ఇస్మాయిల్ ఆదిల్షా ను భందించి రాజ్యమును చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే రాజమాత పుంజీ ఖాతూన్ పన్నాగానికి పైఎత్తువేసినది. కమాల్ ఖాన్ రాజ మందిరములో కత్తితో పొడిచి చంపబడ్డాడు.
కమాల్ ఖాన్ మరణానంతరము ఆయన కుమారుడు ఇస్మాయిల్ ఖాన్ పుంజీ ఖాతూన్నూ, ఇస్మాయిల్ ఆదిల్షానూ బంధించడానికి రాజ మందిరముపై దాడిచేయడానికి ప్రయత్నిస్తూ రాజమందిర ద్వారముల వద్ద జరిగిన ఘర్షణలో మరణించాడు. అప్పటినుండి తల్లి సహాయముతో ఇస్మాయిల్ ఆదిల్షా రాజ్యవ్యవహారములో చూసుకొనడము ప్రారంభించాడు. ఇస్మాయిల్ షియా ముస్లిం మతస్తుడు. ఆయన తన రాజ్యమును షియా ముస్లిం రాజ్యముగా ప్రకటించాడు.
తన తండ్రి యూసుఫ్ ఆదిల్షా కాలములో శ్రీకృష్ణదేవరాయలు హస్తగతము చేసుకున్న రాయచూరు దుర్గమును తిరిగి పొందుటకు ప్రయత్నించగా కృష్ణదేవరాయలు 1520 మే 19 న ఇస్మాయిల్ ఆదిల్షాను చిత్తుగా ఓడించి రాయచూరును స్వాధీనం చేసుకున్నాడు. రాయచూరు ఓటమి తరువాత విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, ఆదిల్షా తన పొరుగున ఉన్న ముస్లిము రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు.
1523 లో ఇస్మాయిల్ ఆదిల్షా తన సోదరి బీబీ మరియంను అహ్మద్నగర్ సుల్తాను బుర్హాన్ నిజాంషా కు ఇచ్చి వైభవముగా వివాహము జరిపించాడు. పెళ్లిలో నిజాంషాకు కట్నముగా షోలాపూర్ పట్టణమును ఇస్తానని ఆదిల్షా రాయబారి బెల్గాంకు చెందిన అసద్ ఖాన్ వాగ్ధానము చేశాడు కానీ ఆ తరువాత వాగ్ధానమును నిలబెట్టుకోలేదు. దీని వలన రెండు రాజ్యాల మధ్య సంబంధాలు దెబ్బతిని అనేక దాడులు, యెదురుదాడులకు దారి తీసినది.
మూస:బీజాపూరు సుల్తానులు