శాసన మండలి

వికీపీడియా నుండి

భారత రాజకీయ వ్యవస్థ
రాజ్యాంగం
భారత దేశం
శాసన వ్యవస్థ
కార్య నిర్వాహక వ్యవస్థ
న్యాయ వ్యవస్థ
రాష్ట్రాలు
ఎన్నికలు
  • ఎన్నికల కమిషను
  • లోక్‌సభ ఎన్నికలు
  • రాజ్యసభ ఎన్నికలు
  • రాష్ట్రపతి ఎన్నిక
  • ఉప రాష్ట్రపతి ఎన్నిక
  • రాష్ట్ర శాసనసభ ఎన్నికలు
  • రాష్ట్ర శాసన మండలి ఎన్నికలు
  • స్థానిక సంస్థల ఎన్నికలు

భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 5 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు జమ్మూ కాశ్మీరు. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

[మార్చు] సభ్యుల అర్హతలు

  • శాసనమండల సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరులై ఉండాలి
  • కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి
  • మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి
  • దివాళా తీసి ఉండరాదు.

[మార్చు] సభా సభ్యత్వం

శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడొంతుల కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 సభ్యులే ఉండటం ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరొంతుల (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు సైన్సు, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడొంతుల మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి మరియు 1/12 వంతు మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల మరియు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.

ఇతర భాషలు