జ్ఞానపీఠ పురస్కారం
వికీపీడియా నుండి
భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ అవార్డు అత్యున్నతమైనది. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, ఐదు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. 1961లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు.
1982కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఏడుసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.
[మార్చు] అవార్డు
(సంవత్సరం - పేరు - కృషి - భాష)
- 1965 - జి శంకర కురుప్ - ఒడక్కుజల్ (వేణువు) - మలయాళం
- 1966 - తారాశంకర్ బందోపాధ్యాయ - గణదేవత - బెంగాలి
- 1967 - డా.కె.వి.పుట్టప్ప - శ్రీ రామాయణ దర్శనం - కన్నడ
- 1967 - ఉమా శంకర్ జోషి - నిషిత - గుజరాతి
- 1968 - సుమిత్రానందన్ పంత్ - చిదంబర - హింది
- 1969 - ఫిరాఖ్ గోరఖ్పురి - గుల్-ఎ-నగ్మా - ఉర్దూ
- 1970 - విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్పవృక్షమ - తెలుగు
- 1971 - బిష్ణు డే - స్మృతి స్త్తా భవిష్యత్ - బెంగాలి
- 1972 - రాంధారి సింగ్ 'దినకర్' - ఊర్వశీ - హింది
- 1973 - దత్తాత్రేయ రామచందరన్ బెంద్రే - నకుతంతి - కన్నడ
- 1973 - గోపీనాథ్ మొహంతి - మట్టిమతల్ - ఒరియా
- 1974 - విష్ణు సకరం ఖాందేకర్ - యయాతి - మరాఠీ
- 1975 - పి.వి.అకిలాండం - చిత్రప్పావై - తమిళం
- 1976 - ఆశా పూర్ణా దేవి - ప్రథం ప్రతిశృతి - బెంగాలి
- 1977 - కె.శివరాం కారంత్ - ముక్కజ్జియ కనసుగలు (బామ్మ కలలు) - కన్నడ
- 1978 - ఎస్.హెచ్.వి.ఆజ్ఞేయ - కిత్నీ నావోన్ మే కిత్నీ బార్ (ఎన్ని పడవల్లో ఎన్నిసార్లు?) - హింది
- 1979 - బీరేంద్ర కుమార్ భట్టాచార్య - మృత్యుంజయ్ - అస్సామీ
- 1980 - ఎస్.కె.పొట్టెక్కాట్ - ఒరు దేశత్తింతె కథ - మలయాళం
- 1981 - అమృతా ప్రీతం - కాగజ్ తే కాన్వాస్ - పంజాబీ
- 1982 - మహాదేవి వర్మ - హిందీ
- 1983 - మాస్తి వెంకటేశ అయ్యంగార్ - చిక్కవీర రాజేంద్ర - కన్నడ
- 1984 - తకజి శివశంకర పిళ్ళె - మలయాళం
- 1985 - పన్నాలాల్ పటేల్ - గుజరాతి
- 1986 - సచ్చిదానంద రౌత్రాయ్ - ఒరియా
- 1987 - విష్ణు వామన్ శిర్వాద్కర్ (కుసుమాగ్రజ్) - మరాఠీ
- 1988 - డా.సి.నారాయణ రెడ్డి - తెలుగు
- 1989 - ఖురాతుల్-ఐన్-హైదర్ - ఉర్దూ
- 1990 - వి.కె.గోకక్ - భారత సింధు రశ్మీ - కన్నడ
- 1991 - సుభాష్ ముఖోపాధ్యాయ - బెంగాలి
- 1992 - నరేశ్ మెహతా - హింది
- 1993 - సీతాకాంత్ మహాపాత్ర - ఒరియా
- 1994 - యు.ఆర్.అనంతమూర్తి - కన్నడ
- 1995 - ఎం.టి.వాసుదేవన్ నాయర్ - మలయాళం
- 1996 - మహాశ్వేతా దేవి - బెంగాలి
- 1997 - ఆలీ సర్దార్ జాఫ్రి - ఉర్దూ
- 1998 - గిరీష్ కర్నాడ్ - కన్నడ
- 1999 - నిర్మల్ వర్మ - హింది
- 1999 - గురుదయాల్ సింగ్ - పంజాబీ
- 2000 - ఇందిరా గోస్వామి - అస్సామీ
- 2001 - రాజేంద్ర కేశవ్లాల్ షా - గుజరాతి
- 2002 - డి.జయకాంతన్ - తమిళం
- 2003 - వృందా కరందికర్ - మరాఠీ