అబ్దుల్లా కుతుబ్ షా

వికీపీడియా నుండి

అబ్దుల్లా కుతుబ్ షా దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యమును పరిపాలించిన కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజు. అతడు 1626 నుండి 1672 వరకు పరిపాలించినాడు.

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా, బహుభాషా కోవిదుడు మరియు సంగీత నాట్య ప్రియుడు. అతడు ప్రసిద్ధి చెందిన పదకర్త క్షేత్రయ్యను తన సభకు ఆహ్వనించి సత్కరించినాడు. క్షేత్రయ్య మధుర భక్తి సాంప్రదాయములో సుప్రసిద్ధుడు. అబ్దుల్లా తరువాత అతని అల్లుడు, అబుల్ హసన్ కుతుబ్ షా, గోల్కొండ రాజు అయినాడు.


కుతుబ్ షాహీలు
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ | జంషీద్ కులీ కుతుబ్ షా | సుభాన్ కులీ కుతుబ్ షా | ఇబ్రహీం కులీ కుతుబ్ షా | మహమ్మద్ కులీ కుతుబ్ షా | సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా | అబ్దుల్లా కుతుబ్ షా | అబుల్ హసన్ కుతుబ్ షా