టంగుటూరి అంజయ్య

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.

టంగుటూరి అంజయ్య(ఆగష్టు 16,1919 - అక్టోబర్ 19,1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబర్ నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు[1]. కాంగ్రేసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభకు ఎన్నికైనాడు.

[మార్చు] ముఖ్యమంత్రిగా

1982లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు[2]. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడితేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు[3]. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయి ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.

1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు.ఈయన తర్వాత ఈయన సతీమణి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.

[మార్చు] మూలాలు

  1. లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం
  2. Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41
  3. Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41


ఇంతకు ముందు ఉన్నవారు:
డా.మర్రి చెన్నారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
11/10/1980—24/02/1982
తరువాత వచ్చినవారు:
భవనం వెంకట్రామ్
ఇతర భాషలు