పెద్దాపుర సంస్థానం
వికీపీడియా నుండి
పెద్దాపురం పట్టణం పెదపాత్రుడు మహారాజుచే నిర్మించబడింది. క్షత్రియ కులస్థులైన వత్సవాయి కుటుంబంచే 300ల సంవత్సరములు పరిపాలించబడింది. ఈ కుటుంబ పరంపర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహదూర్ తో ప్రారంభమైంది. 1555 నుంచి 1607 మద్య కాలంలో ఇతను పరిపాలించాడు. పెద్దాపురం కోట ఇతని హయాంలోనే నిర్మించబడింది. ఇతని తరువాత, ఇతని కుమారుడు రాయ జగపతి, తరువాత ఇతని కుమారులు తిమ్మ జగపతి మరియు బలభద్ర జగపతి పరిపాలించారు.1785 కి పెద్దాపురం రాజ్యము అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు మరియు పట్టణములతో విరాజిల్లింది. 1791 నుంచి 1804 వరకు వత్సవాయి రాయ జగపతి పరిపాలించెను. ఇతని భార్య అయిన బుచ్చి సీతమ్మ 1828 నుంచి 1835 వరకు పాలించెను. ఈవిడ రెండు ట్రస్టులు, ఒకటి పెద్దాపురంలోను, మరియొకటి కత్తిపూడిలోను ప్రారంభించెను. ఈ రోజుకి కూడా అక్కడ పేదవారికి రెండు పూటలా అక్కడ అన్నదానం చేయబడుతున్నది. వత్సవాయి మహరాజా యొక్క ఆస్థానంలో ఎనుగుల లక్ష్మణ కవి మరియు వేదుల సత్యన్నారాయణ శాస్త్రి పోషించబడ్డారు. తరువాత వారసులు లేకపొవటం చేత, 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు, సూర్యనారాయణ జగపతి బహదూర్ ఏలిక సాగించెను. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవీన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు మరియు లూథరన్ హైస్కూలు నిర్మించారు.
[మార్చు] పాలనా క్రమము
- సార్వభౌమ తిమ్మరాజు (1649-1688)
- ఉద్దండ రాయపరాజు (1688-1714)
- ముమ్మడి తిమ్మరాజు (1714-1734)
- రుస్తుం ఖాన్ (1734-1749)
- జగపతి రాజు (1749-1758)
- నాలుగవ తిమ్మరాజు (1760-1797)
[మార్చు] మూలాలు
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర 12వ సంపుటం పేజీ.214