మొదటి బుక్క రాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు

మొదటి హరిహర రాయలువారి సోదరుడు, ఈ మొదటి బుక్క రాయలు. ఇతను క్రీ. శ. 1356నందు విజయనగర రత్న సింహాసనమధిష్టించినాడు. ఇతను విజయనగర రాజ్య స్తాపనమున, తరువాత బహుమనీ సుల్తానులతో జరిగిన యుద్దములందు తన అన్నగారయిన మొదటి హరిహర రాయలునకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇతను కుమారుడు కంప రాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.

విషయ సూచిక

[మార్చు] బహుమనీ సుల్తానులతో యుద్దాలు

[మార్చు] మొదటి యుద్దములు

బహుమనీ సుల్తాను అయిన మహమ్మద్‌ షా I ఓరుగల్లును ముట్టడించి, ఓరుగల్లునకు సహాయముగా వచ్చిన విజయ నగర ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత 1366న అపరాధరుసుము చెల్లించమని బుక్క రాయలకు తాకీదు పంపించినాడు, దానితో బుక్క రాయలు కోపితుడై బహుమనీ రాజ్యమునందున్న ముద్గల్లుకోటను ఆక్రమించినాడు. బహుమనీ సేనలు ముందుకు వచ్చి విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఆదవాని, కౌతల ప్రాంతములందు జరిగిన యుద్దములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్దమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు బుక్క రాయలు సుల్తానుతో సంధి చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానికానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.

[మార్చు] రెండవ యుద్దములు

మొదటి యుద్దము తరువాత 1375 వరకూ యధాతథ స్తితి కొనసాగినది. కానీ 1375 వ సంవత్సరమున మహమ్మద్ షా దివంగతులయినారు. తరువాత అతని వారసుడు ముజాహిద్ షా సింహాసనము అధిరోహించినాడు. ఈ సమయములో బుక్క రాయలు కృష్ణా నది, తుంగ భద్రా నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్దము ప్రారంభమయినది. ఈ యుద్దమున విజయనగర సైనికులు ఓడిపొయినారు. బహుమనీ సైనికులు విజయ నగర సైనికులను తుంగభద్రా నది దాటువరకూ తరిమివేసినారు.

[మార్చు] కవులు

  • ఉత్తర హరివంశమునకు కర్త అయిన నాచన సోమనాథుడు వీరి ఆస్తానంలోని వాడే!

[మార్చు] మంత్రి

బుక్క రాయలకు మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన మాధవులు, వీరు గురువుగారు విద్యారణ్యస్వామి.


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
మొదటి హరిహర రాయలు
విజయనగర సామ్రాజ్యము
1356 — 1377
తరువాత వచ్చినవారు:
రెండవ హరిహర రాయలు
ఇతర భాషలు