చిన లింగాయ పాలెం

వికీపీడియా నుండి

చిన లింగాయ పాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము. పొన్నూరు నుండి 14 కి.మీ, గుంటూరు నుండి 28 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. విద్యారంగం లో వాసికెక్కిన ఈ గ్రామం, రాజకీయంగాను చైతన్య వంతమయినది. ఈ ప్రాంతం లొనే మొట్టమొదటి పాఠశాల ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడ ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. కనీస సౌకర్యాలు లేని ఆ రొజుల్లోనే, ఏంతొ ప్రగతి సాధించిన ఈ గ్రామం సమీప గ్రామాలకు కూడలి. ఆది నుండి ఎందరొ ప్రముఖులు సల్పిన కృషి ఫలితంగా ఉన్నత పాఠశాల, పశువుల వైద్యశాల, టెలిఫోన్ ఎక్స్ఛేంజి, రక్షిత నీటి సరఫరా వంటి సౌకర్యాలు గ్రామంలో ఎర్పడ్డాయి. చిన లింగాయ పాలెం , గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.